డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో ఆ స్టార్ హీరో పర్ఫామెన్స్

by Dishanational3 |
డబ్ల్యూపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో ఆ స్టార్ హీరో పర్ఫామెన్స్
X

దిశ, స్పోర్ట్స్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) రెండో సీజన్‌‌కు సమయం ఆసన్నమైంది. మరో మూడు రోజుల్లో లీగ్‌కు తెరలేవనుంది. ఈ నెల 23 నుంచి టోర్నీ ప్రారంభకానుంది. ప్రారంభ సీజన్ సూపర్ హిట్ కావడంతో.. రెండో సీజన్ ఓపెనింగ్ సెర్మనీని ఘనంగా నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్ల మధ్య ఓపెనింగ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌ ప్రారంభానికి ముందు స్టేడియంలో ప్రారంభ వేడుకలకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ముంబై, ఢిల్లీ జట్ల మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు గంట ముందు అంటే 6:30 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకోసం బాలీవుడ్ స్టార్స్‌‌తోపాటు పలువురు సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్వాహకులు ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. గతేడాది ప్రారంభ సీజన్‌లో కియారా అద్వానీ, కృతి సనన్ డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కూడా బాలీవుడ్ స్టార్లు ఓపెనింగ్ సెర్మనీలో అలరించనున్నారు. దీనికి సంబంధించిన వివరాలను నిర్వాహకులు ఒక్కొక్కటిగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సారి బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనున్నాడు. ప్రారంభ వేడుకలో కార్తీక్ ఆర్యన్ పర్ఫామెన్స్ చేయనున్నట్టు నిర్వాహకులు సోమవారం ధ్రువీకరించారు. ఓపెనింగ్ సెర్మనీలో ఇంకా ఎవరెవరు పాల్గొంటారో తెలియాల్సి ఉంది. లీగ్ ప్రారంభ రోజు నాటికి నిర్వాహకులు ఈ జాబితాను విడుదల చేయనున్నారు.

Next Story

Most Viewed