తొలి కప్పు గెలిచేదెవరో.. డబ్ల్యూపీఎల్ ఫైనల్ నేడే..

by Disha Web Desk 13 |
తొలి కప్పు గెలిచేదెవరో.. డబ్ల్యూపీఎల్ ఫైనల్ నేడే..
X

దిశ, వెబ్‌డెస్క్: మహిళా ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్‌) తుది అంకానికి చేరుకుంది. తొలి సీజన్ ఫైనల్ మ్యాచ్ ఈ రోజు జరగనుంది. లీగ్ దశలో అదరగొట్టిన ముంబై, ఢిల్లీ జట్లే తుదిపోరుకు చేరుకున్నాయి. లీగ్‌ దశలో పాయింట్ల పట్టికలో టాప్‌లో నిలిచిన ఢిల్లీ క్యాపిటల్స్‌ నేరుగా ఫైనల్‌కు అర్హత సాధించగా.. ఎలిమినేటర్ మ్యాచ్‌లో యూపీ వారియర్స్‌ను చిత్తుగా ఓడించి ముంబై ఇండియన్స్ ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ సారథ్యంలోని ముంబై ఇండియన్స్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌లో సమతూకంగా ఉండగా.. ఆసీస్ దిగ్గజం మెగ్ లానింగ్ లీడ్ చేస్తున్న ఢిల్లీ టాప్ ఆర్డర్ పెట్టని కోటలా బలంగా ఉంది. సమ ఉజ్జీలుగా నిలిచిన ఈ జట్ల మధ్య హోరాహోరీ సమరం ఖాయమే. ఒత్తిడిని జయించి ఎవరు తొలి టైటిల్‌ చేపడతారో తెలియాలంటే కొన్ని గంటలు ఆగాల్సిందే. రాత్రి 7.30కి మ్యాచ్ మొదలవుతుంది.



Next Story

Most Viewed