- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రెండో యూత్ టెస్టులో భారత్ అండర్-19 విక్టరీ.. మెరిసిన తెలుగు కుర్రాడు
శ్రీలంక అండర్-19తో జరిగిన రెండో యూత్ టెస్టులో భారత్ అండర్-19 జట్టు 211 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది.

దిశ, స్పోర్ట్స్ : శ్రీలంక అండర్-19తో జరిగిన రెండో యూత్ టెస్టులో భారత్ అండర్-19 జట్టు 211 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. తొలి టెస్టు డ్రా అయిన విషయం తెలిసిందే. రెండో టెస్టులో నెగ్గడంతో సిరీస్ను కూడా భారత్ 1-0తో సొంతం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్లో 411 రన్స్ చేసిన ఇండియా.. శ్రీలంకను 148 పరుగులకే కూల్చేసి 263 పరుగుల భారీ లీడ్ సాధించింది. రెండో ఇన్నింగ్స్లో 208/3 వద్ద డిక్లేర్డ్ ఇచ్చి 472 పరుగుల భారీ లక్ష్యాన్ని శ్రీలంక ముందు పెట్టింది. గురువారం 155/4తో చేజింగ్ను కొనసాగించిన శ్రీలంక 260 పరుగులకే ఆలౌటైంది. ఆ జట్టులో విమత్ దిన్సారా(64), సెనుజ వెకునగోడ(64), సెనెవిరత్నె(42) రాణించగా.. భారత బౌలర్ల ధాటికి ఆ జట్టు ఏ దశలోనూ పోటీనివ్వలేకపోయింది. బౌలర్లు రోహిత్ యాదవ్ 4 వికెట్లు, చిగురపాటి వెంకట 3 వికెట్లు పడగొట్టి శ్రీలంక పతనాన్ని శాసించారు. చిగురపాటి వెంకటది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణ జిల్లా. అయితే అతను దేశవాళీలో గోవాకు ఆడుతున్నాడు.






