వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్.. పిచ్ రిపోర్ట్

by Disha Web Desk 12 |
వరల్డ్ కప్ సెమీ ఫైనల్స్.. పిచ్ రిపోర్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023లో మొదటి సెమీ ఫైనల్ భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ముంబై లోని వాంఖడే స్టేడియంలో జరగనుంది. రోహిత్ శర్మకు ఇది హోమ్ గ్రౌండ్. అయితే ఈ రోజు ఉదయం పిచ్ రిపోర్టును అంపైర్లు విడుదల చేశారు. సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం స్లో పిచ్ సిద్ధం చేసినట్లు చేశారు. కాగా భారత టీం మెనేజ్ మెంట్ సూచనతో బీసీసీఐ క్యూరేటర్లు పిచ్ పై గడ్డిన తొలగించారు.

అయితే వాంఖడే స్టేడియం పూర్తిగా స్పిన్నర్లకు స్వర్గధామంగా ఉంటుంది. అయితే స్పిన్నర్లు కూడా స్లో డెలివరీలు వేస్తేనే మంచి ఫలితాలు రాబట్టగలుగుతారు. భారత జట్టులో ప్రస్తుతం కుల్దీప్, జడేజాలు స్పిన్ విభాగంలో మంచి ఫామ్ లో కొనసాగుతున్నారు. అలాగే న్యూజిలాండ్ జట్టులో సాంట్నర్ ఉన్నాడు. అయినప్పటికి వాంఖడే పిచ్ పై కుల్దీప్, జడేజా మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది.



Next Story