Virender Sehwag: Prabhas ‘ఆదిపురుష్‌’పై మాజీ క్రికెటర్ సెటైర్లు..

by Disha Web Desk 13 |
Virender Sehwag: Prabhas ‘ఆదిపురుష్‌’పై మాజీ క్రికెటర్ సెటైర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన 'ఆదిపురుష్'పై టీమ్ ఇండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సెటైర్లు వేశాడు. సెహ్వాగ్ సినిమా చూసి.. సోషల్ మీడియాలో “ఆదిపురుష్ చూసిన తర్వాత కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడో అర్థం అయింది” అనీ ట్వీట్ చేయడం జరిగింది. ప్రభాస్ “ఆదిపురుష్” సినిమా ఒప్పుకున్నందుకే కట్టప్ప చంపేసాడు అనే అర్థంలో సెటైర్ వేయడం జరిగింది. సెహ్వాగ్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఈ విషయంలో సెహ్వాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. చాలా మంది మాత్రం ఈ డ్యాషింగ్ ఓపెనర్ కామెంట్స్‌తో ఏకీభవిస్తున్నారు. ఈ సినిమాపై ఫ్యాన్స్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రామాయణాన్ని వక్రీకరించారని, పాత్రలను ఇష్టం వచ్చినట్లు మార్చేశారని కొందరు ఈ సినిమాను తిట్టిపోస్తున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed