అతనికి 40 బంతుల్లో సెంచరీ బాదే సత్తా ఉంది : గంగూలీ

by Dishanational3 |
అతనికి 40 బంతుల్లో సెంచరీ బాదే సత్తా ఉంది : గంగూలీ
X

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి 40 బంతుల్లో సెంచరీ చేసే సత్తా ఉందని భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఢిల్లీలో ఓ కార్యక్రమంలో గంగూలీ మాట్లాడుతూ టీ20 వరల్డ్ కప్‌కు ముందు భారత ఆటగాళ్లకు కీలక సూచనలు చేశాడు. నిర్భయంగా ఆడటం చాలా ముఖ్యమన్నాడు. ‘టీ20ల్లో వయసు, యువకులకు సంబంధించి కఠినమైన, వేగవంతమైన నిబంధన ఏం లేదు. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్ ఇంకా టెస్టుల్లో ఆడుతున్నాడు. 30 ఓవర్లు వేస్తున్నాడు. ఎంఎస్ ధోనీ సిక్స్‌లు కొడుతున్నాడు. వారిద్దరి వయసు 40 ఏళ్లు. సిక్స్‌లు కొట్టడం ముఖ్యం. 40 బంతుల్లో శతకం బాదే సత్తా విరాట్‌కు ఉంది.’ అని తెలిపాడు. టీ20 వరల్డ్ కప్‌లో రోహిత్‌తో కలిసి కోహ్లీ ఓపెనింగ్ చేయాలని దాదా అభిప్రాయపడ్డాడు. ‘రోహిత్, విరాట్, సూర్యకుమార్, శివమ్ దూబె, హార్దిక్ పాండ్యా ప్రతిభావంతులు. వారిలో సిక్స్‌లు కొట్టే సామర్థ్యం అద్భుతం. జట్టులో అనుభవజ్ఞులు, యువకుల సమతుల్యత అవసరం. గొప్ప జట్టు ఇదే కలిగి ఉంటుంది.’ అని గంగూలీ తెలిపాడు.



Next Story

Most Viewed