కడుపుబ్బా నవ్వించిన కింగ్ కోహ్లీ.. మ్యాచ్ మధ్యలో ఏం చేశాడంటే? (వీడియో)

by Disha Web Desk 2 |
కడుపుబ్బా నవ్వించిన కింగ్ కోహ్లీ.. మ్యాచ్ మధ్యలో ఏం చేశాడంటే? (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రికార్డుల రారాజు, టీమిండియా డాషింగ్ బ్యాట్‌మెన్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సచిన్ తర్వాత ఎన్నో రికార్డులు తన పేరుమీద లిఖించుకున్నారు. కొన్నిసార్లు సచిన్ రికార్డులు కూడా తిరగరాశారు. ప్రస్తుతం జరుగుతోన్న ఆసియా కప్‌లో మాంచి ఫామ్‌లో కోహ్లీ రాణిస్తున్నారు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగి జట్టుకు విజయాన్ని చేరువా చేశారు. ఇదిలా ఉండగా.. నిన్న బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ రెస్ట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్‌లో జట్టు సభ్యులకు డ్రింక్స్ అందిస్తూ కనిపించారు. ఈ క్రమంలో ఆట మధ్యలో మైదానంలో డ్రింక్స్‌ తీసుకొస్తూ కామెడీగా పరుగెత్తాడు. అది గమనించిన మిగతా ప్లేయర్లు తెగ నవ్వుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిని గమనించిన నెటిజన్లు ఆటతో పాటు డ్రింక్స్‌ అందించడాన్ని ఎంజాయ్ చేస్తున్న ఏకైక ప్లేయర్ కింగ్ కోహ్లీ అంటూ ప్రశంసిస్తున్నారు.



Next Story

Most Viewed