మరో రికార్డుపై కోహ్లీ కన్ను.. కివీస్‌తో మ్యాచ్‌ ఆ ఒక్కటి చేస్తే చాలు..!

by Dishanational4 |
మరో రికార్డుపై కోహ్లీ కన్ను.. కివీస్‌తో మ్యాచ్‌ ఆ ఒక్కటి చేస్తే చాలు..!
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నాడు. తన కెరీర్‌లో ఇప్పటికే ఎన్నో రికార్డును తన ఖాతాలో వేసుకున్న ఈ ప్లేయర్ మరో రికార్డుపై కన్నేసాడు. మంచి ఫామ్‌లోకి వచ్చిన కోహ్లీ.. సెంచరీలు బాదుతూ పరుగుల వరద పారిస్తున్నాడు. అయితే ఇవాళ న్యూజిలాండ్, భారత్ మధ్య తొలి వన్డే మ్యాచ్ ఉప్పల్ స్టేడియంలో జరుగనుంది. కాగా, ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ఒక సెంచరీ చేస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలుస్తాడు. కాగా కివీస్‌పై ఇప్పటి వరకు అత్యధిక సెంచరీలు నమోదు చేసిన వారి జాబితాలో.. టీమిండియా మాజీ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్‌, ఆస్ట్రేలియా మాజీ ప్లేయర్ రికీ పాంటింగ్‌ 6 సెంచరీలతో ముందున్నారు. న్యూజిలాండ్‌పై ఇప్పటి వరకు విరాట్ కోహ్లీ 5 సెంచరీలు చేయగా మరో సెంచరీ బాదితే వారి సరసన చేరి సరికొత్త ఘనత సాధిస్తాడు. మరి ఇవాళ కివీస్‌తో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ రికార్డు సాధిస్తాడో లేదో వేచి చూడాలి.

Also Read....

దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత మహిళల జట్టు

Next Story

Most Viewed