అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం.. అతని స్థానంలో ఆ యువ ప్లేయర్‌కు చాన్స్

by Harish |

అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లీ దూరం.. అతని స్థానంలో ఆ యువ ప్లేయర్‌కు చాన్స్
X

దిశ, స్పోర్ట్స్ : అఫ్గానిస్తాన్‌తో జరిగే వన్డే సిరీస్‌కు భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ దూరమయ్యాడు. కండరాల గాయం కారణంగా అతను ఈ సిరీస్‌కు అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ శనివారం ధ్రువీకరించింది. దీంతో కోహ్లీ స్థానంలో యశస్వి జైశ్వాల్‌ను వన్డే జట్టుకు ఎంపిక చేసింది. ప్రస్తుతం అతను అఫ్గాన్‌తో ఏకైక టెస్టు ఆడుతున్నాడు. ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌‌కు విరాట్ ఫిట్‌గా ఉండే అవకాశం ఉందని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపాడు. ‘కోహ్లీ గాయపడి వారం కూడా కాలేదు. అతను ఎప్పుడు తిరిగి వస్తాడో మాకు కచ్చితంగా తెలియదు. కానీ, ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్ నాటికి ఫిట్‌గా ఉంటాడని ఆశిస్తున్నాం. ఇంకా ఫిజియోల నుంచి అయితే స్పష్టత రాలేదు.’అని అగార్కర్ తెలిపాడు. ఇటీవలే ముగిసిన ఐపీఎల్‌లో ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కోహ్లీ కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే.16 మ్యాచ్‌ల్లో 675 పరుగులు చేశాడు. గుజరాత్‌తో జరిగిన ఫైనల్‌లో కోహ్లీ గాయపడినట్టు తెలుస్తోంది. గతేడాది వన్డేల్లోకి అరంగేట్రం చేసిన జైశ్వాల్ ఇప్పటివరకు 4 మ్యాచ్‌లు ఆడాడు. అందులో సౌతాఫ్రికాపై తొలి వన్డే సెంచరీ నమోదు చేశాడు. భారత్, అఫ్గాన్ జట్ల మధ్య ఈ నెల 3న తొలి వన్డే జరగనుంది.


Next Story