ఆసిస్‌తో ఐదో టెస్టులో గంభీర్ అతనికి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చాడా?.. ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి..

by Harish |
ఆసిస్‌తో ఐదో టెస్టులో గంభీర్ అతనికి కెప్టెన్సీ ఆఫర్ ఇచ్చాడా?.. ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి..
X

దిశ, స్పోర్ట్స్ : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టుకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఆ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీని కెప్టెన్సీ చేయమని హెడ్ కోచ్ గంభీర్ అడిగాడట. కానీ, అందుకు విరాట్ నిరాకరించినట్టు ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. ఐదో టెస్టుకు రోహిత్ స్వచ్ఛందంగా దూరంగా ఉన్న విషయం తెలిసిందే. కెప్టెన్ ఓ మ్యాచ్ నుంచి స్వయంగా తప్పుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. పేలవ ఫామ్ నేపథ్యంలోనే ఆ నిర్ణయం తీసుకున్నట్టు హిట్‌మ్యాన్ చెప్పాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 రన్సే చేశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా జట్టును నడిపించాడు. అయితే, ఐదో టెస్టులో విరాట్ కోహ్లీ నాయకత్వం వహించాలని గంభీర్ ఆశించాడని ఓ జాతీయ మీడియా సంస్థ తెలిపింది. కానీ, కోహ్లీ మరోసారి కెప్టెన్సీ రోల్ చేపట్టకూడదని నిర్ణయం తీసుకున్నాడని, అందుకే గంభీర్ రిక్వెస్ట్‌ను నిరాకరించాడని పేర్కొంది. ఇటీవల రంజీ ట్రోఫీలోనూ ఢిల్లీ జట్టుకు కెప్టెన్సీ చేయడానికి కోహ్లీ ఇష్టపడలేదని వార్తలు వచ్చాయి.


Advertisement
Next Story