57 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన యూఏఈ

by velandi.Saikiran |

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా అదరగొట్టింది. యూఏఈ జట్టును కేవలం 57 పరుగులకే ఆల్ అవుట్

57 ప‌రుగుల‌కే కుప్ప‌కూలిన యూఏఈ
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా కప్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో టీమిండియా అదరగొట్టింది. యూఏఈ జట్టును కేవలం 57 పరుగులకే ఆల్ అవుట్ చేసింది టీమిండియా. కుల్దీప్ యాదవ్, శివం దూబే ఇద్దరు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టు... 13 ఓవర్లకే కుప్ప కూలింది. ఈ నేపథ్యంలో 10 వికెట్లు నష్టపోయిన యూఏఈ 57 పరుగులు మాత్రమే చేసింది. కుల్దీప్ యాదవ్... ఈ మ్యాచ్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. శివం దూబే ఏకంగా మూడు వికెట్లు తీసి దుమ్ము లేపాడు. బుమ్రా కు ఒక వికెట్ పడగా అక్షర పటేల్, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. ఇక నిర్ణీత 20 ఓవర్లలో 58 పరుగులు చేస్తే... మొదటి మ్యాచ్ లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొడుతుంది.

Next Story