పీక‌ల్లోతూ క‌ష్టాల్లో పాకిస్థాన్‌...కెప్టెన్ పై దారుణంగా ట్రోలింగ్

by velandi.Saikiran |   (  Updated:2025-09-14 15:41:42  IST  )

ఆసియా క‌ప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జ‌రుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ప‌డింది. దుబాయ్ వే

పీక‌ల్లోతూ క‌ష్టాల్లో పాకిస్థాన్‌...కెప్టెన్ పై దారుణంగా ట్రోలింగ్
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా క‌ప్ 2025 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ జ‌రుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ పీక‌ల్లోతూ క‌ష్టాల్లో ప‌డింది. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న టీమిండియా వ‌ర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ లో స‌ల్మాన్ అఘా టీం కుప్ప‌కూలింది. 64 ప‌రుగుల‌కే 6 వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభం అయిన నుంచి పాకిస్థాన్ బ్యాట‌ర్లు త‌డ‌బ‌డుతూనే ఉన్నారు. అటు బుమ్రా, పాండ్యా, అక్ష‌ర్, కుల్దీప్ యాద‌వ్ రెచ్చిపోయి బౌలింగ్ చేశారు. ఈ త‌రుణంలోనే... 12.5 ఓవ‌ర్ల‌లోనే...6 వికెట్లు న‌ష్ట‌పోయి.. 64 ప‌రుగులు చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు అయితే... అక్ష‌ర్, కుల్దీప్ యాద‌వ్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు. బుమ్రా, పాండ్యా ఇద్ద‌రు చెరో వికెట్ తీశారు. అటు పాకిస్తాన్ కెప్టెన్ స‌ల్మాన్ అఘా 3 ప‌రుగులే చేయ‌డంతో.. టీ20 ల‌కు ప‌నికి రాడ‌ని ట్రోలింగ్ చేస్తున్నారు.

Next Story