మోడీ స్టేడియం దగ్గర హై టెన్షన్...పిచ్చెక్కిపోవాల్సిందే !

by velandi.Saikiran |

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... మరికొద్ది క్షణాల్లోనే ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో...

మోడీ స్టేడియం దగ్గర హై టెన్షన్...పిచ్చెక్కిపోవాల్సిందే !
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో... మరికొద్ది క్షణాల్లోనే ఫైనల్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో... అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం బయట... ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సంబంధించిన అభిమానులు అందరూ... RCB జెర్సీలతో ఒకేసారి గ్రౌండ్ లోకి ప్రవేశించారు. దీంతో స్టేడియం బయట భారీ ట్రాఫిక్ జామ్ అయింది.

అభిమానులు కూడా ఒక్కసారిగా... స్టేడియం వద్దకు చేరుకోవడంతో... కాస్త ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ సారి ఎలాగైనా బెంగళూరు టైటిల్ గెలవాలని... ఆశిస్తూ అభిమానులు భారీ సంఖ్యలో వస్తున్నారు. అటు వర్షం కూడా తగ్గిపోవడంతో... ఫ్యాన్స్ కు కాస్త ఊరట లభించింది. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్..... మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో... రాయల్ చాలెంజెస్ బెంగళూరు జట్టు మొదట బ్యాటింగ్ చేయనుంది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Next Story