WPL వేలంలో తెలుగమ్మాయిల హవా

by Muthe.Rajitha |

WPL 2026 వేలంలో రెండు తెలుగు రాష్ట్రాల మహిళా క్రికెటర్లు అదరగొట్టారు.

WPL వేలంలో తెలుగమ్మాయిల హవా
X

దిశ, వెబ్ డెస్క్ : WPL 2026 వేలంలో రెండు తెలుగు రాష్ట్రాల మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఈ వేలంలో పలు జట్లు ఇరు రాష్ట్రాల మహిళా క్రికెటర్లను మంచి మొత్తాలకు తీసుకున్నాయి. గొంగడి త్రిషను యూపీ వారియర్స్ ₹10 లక్షలకు కొనుగోలు చేయగా, మమతను ఢిల్లీ క్యాపిటల్స్ ₹10 లక్షలకు దక్కించుకుంది. క్రాంతి రెడ్డిని ముంబై ఇండియన్స్ ₹10 లక్షలకు తీసుకుంది. ఇక సీనియర్ క్రికెటర్ అరుంధతి రెడ్డిని RCB జట్టు ₹75 లక్షలకు దక్కించుకుంది.

ఇక ఇటీవల జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్‌లో కీలక పాత్ర పోషించి భారత జట్టుకు విజయాన్ని అందించిన నల్లపు రెడ్డి శ్రీచరణిని ఢిల్లీ జట్టు ₹1.30 కోట్ల భారీ మొత్తానికి తిరిగి సొంతం చేసుకుంది. మొత్తంగా చూసుకుంటే WPL 2026 వేలం తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా క్రికెటర్ల జోరు కొనసాగింది అనే చెప్పాలి.

Next Story