జడేజా మ్యాజిక్.. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం

by Disha Web Desk 2 |
జడేజా మ్యాజిక్.. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న రెండో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్ధేశించిన 113 పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చేధించి ఆరు వికెట్ల తేడాతో గెలుపొందింది. మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు గెలిచి భారత్‌ లీడ్‌లో కొనసాగుతోంది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ(31), పుజారా(31), కోహ్లీ(20), శ్రీకర్ భరత్(23)లతో రాణించి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించారు. అంతకు ముందు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా బ్యాటర్లలో.. హెడ్(43), లబుషేన్(35) పరుగులు చేశారు. మిగతా బ్యాట్‌మెన్లంతా చేతులెత్తేశారు. భారత బౌలర్లలో అశ్విన్ 3 వికెట్లు తీయగా, జడేజ ఏకంగా 7 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో లయన్ 2, మర్ఫి 1 వికెట్ తీశారు.

Next Story

Most Viewed