ఐర్లాండ్ పర్యటనకు టీమ్ ఇండియా..

by Disha Web Desk 13 |
ఐర్లాండ్ పర్యటనకు టీమ్ ఇండియా..
X

న్యూఢిల్లీ: గతేడాది టీ20 సిరీస్ కోసం ఐర్లాండ్ పర్యటనకు వెళ్లిన టీమ్ ఇండియా 2-0తో క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. వరుసగా రెండో సంవత్సరం కూడా భారత జట్టు ఐర్లాండ్‌‌కు వెళ్లనుంది. ఈ విషయాన్ని ఐర్లాండ్ క్రికెట్ బోర్డు శుక్రవారం వెల్లడించింది. ‘ఈ వేసవి క్రికెట్ అభిమానులకు సాధారణం కంటే ఎక్కువ మజాను అందించనుంది. టీమ్ ఇండియా వరుసగా రెండో సారి ఐర్లాండ్‌లో పర్యటించనుంది’ అని తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు 18 నుంచి 23 తేదీల మధ్య భారత్ ఐర్లాండ్‌‌లో పర్యటించనుంది. మలాహిడ్ వేదికగా ఇరు జట్లు మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనున్నాయి. మ్యాచ్ తేదీలను త్వరలో ప్రకటించనున్నారు.

Next Story