WTC Final : కొత్త జెర్సీతో ఫొటోలకు ఫోజులిచ్చిన టీమ్ ఇండియా ప్లేయర్లు..

by Disha Web Desk 13 |
WTC Final : కొత్త జెర్సీతో ఫొటోలకు ఫోజులిచ్చిన టీమ్ ఇండియా ప్లేయర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా కిట్స్ స్పాన్సర్‌గా ఇటీవల బీసీసీఐతో ఒప్పందం కుదుర్చుకున్న అడిడాస్.. నూతన జెర్సీలను విడుదల చేసిన విషయం తెలిసిందే. టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్‌లకు వేర్వేరుగా జెర్సీలను రూపొందించింది. తాజాగా ఆ జెర్సీలను ధరించి టీమిండియా ఆటగాళ్లు తళుక్కున మెరిశారు. కొత్త జెర్సీలతో ఫొటోలకు ఫోజులిచ్చారు. దీంతో జెర్సీలు సూపర్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రతిష్టాత్మక ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు భారత్ సిద్ధమైంది. జూన్ 7-11 మధ్య లండన్‌లోని ఓవల్ మైదానం వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్‌లో టీమిండియా ఈ కొత్త జెర్సీలతో బరిలోకి దిగనుంది. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్‌‌లో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీని ఇటీవలే జట్టు కిట్ స్పాన్సర్ అడిడాస్ విడుదల చేసింది. టెస్టు, వన్డే, టీ-20 ఫార్మాట్‌లకు మూడు భిన్నమైన జెర్సీలను ఆవిష్కరించింది.

తాజాగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, మహిళా జట్టు ప్లేయర్లు హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన సహా పలువురు కొత్త జెర్సీలు వేసుకుని ఫొటోలకు ఫోజులిచ్చారు. కాలర్ లేకుండా డార్క్ బ్లూ కలర్‌లో టీ-20 జెర్సీ ఉండగా.. లైట్ బ్లూ కలర్‌లో కాలర్‌తో ఉన్న జెర్సీని వన్డేలకు ఎంపిక చేశారు. టెస్టులకు కేవలం వైట్ మాత్రమే కాకుండా కాస్త బ్లూ కలర్‌ను యాడ్ చేసి డిజైన్ చేశారు. వీటిని చూసిన అభిమానులు కొత్త జెర్సీల లుక్ అదిరిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం వరకు కిల్లర్ జీన్స్ టీమిండియా కిట్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అయితే కిల్లర్ జీన్స్ వైదొలగడంతో బీసీసీఐ, అడిడాస్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.

Next Story

Most Viewed