ఆసియా కప్ ఛాంపియన్స్‌గా టీమిండియా.. భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన BCCI

by Kema Shiva Kumar |

Team India becomes Asia Cup champions.. BCCI announces huge prize money

ఆసియా కప్ ఛాంపియన్స్‌గా టీమిండియా.. భారీ ప్రైజ్‌మనీ ప్రకటించిన BCCI
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా (Team India) ఏకంగా తొమ్మిదోసారి ఆసియా కప్‌ను ముద్దాడింది. తిలక్‌ వర్మ (Tilak Varma) 53 బంతుల్లో 39 పరుగులు చేసి అద్భుతంగా పోరాడడంతో ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో దాయాది పాకిస్థాన్‌ (Pakistan)ను ఓడించింది. కుల్‌దీప్‌ 4, అక్షర్‌ పటేల్‌ 2, వరుణ్‌ చక్రవర్తి 2 అద్భుతంగా బౌలింగ్ చేయడంతో భారత్‌ మొదట పాక్2ను 19.1 ఓవర్లలో 146 పరుగులకు ఆలౌట్‌ చేసింది. ఓపెనర్లు ఫర్హాన్‌ 38 బంతుల్లో 57, ఫకార్‌ జమాన్‌ 35 బంతుల్లో 46 రాణించారు. తిలక్‌తో పాటు శివమ్‌ దూబె 22 బంతుల్లో 33 పరుగులతో రాణించడంతో భారత్‌ టార్గెట్‌ను 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. అయితే, ఆసియా కప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియాకు రూ.21 కోట్ల ప్రైజ్‌ మనీని బీసీసీఐ (BCCI) ప్రకటించింది. ఇందులో సపోర్ట్‌ స్టాఫ్‌ కూడా భాగస్వాములు కానున్నారు.

Next Story