తెలుగు టైటాన్స్ మళ్లీ చిత్తు

by Dishanational5 |
తెలుగు టైటాన్స్ మళ్లీ చిత్తు
X

దిశ, స్పోర్ట్స్: ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్ జట్టు అత్యంత చెత్త ప్రదర్శన కనబరుస్తోంది. వరుస ఓటములతో అభిమానులను తీవ్రంగా నిరాశపరుస్తోంది. ప్రో కబడ్డీ లీగ్(పీకేఎల్)లో భాగంగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్‌లో తమిళ్ తలైవాస్ చేతిలో తెలుగు టైటాన్స్ జట్టు 29-54 తేడాతో చిత్తుగా ఓడింది. తలైవాస్ జట్టులో రైడర్లు అజింక్యా పవర్(11పాయింట్లు), నరేందర్(10)తోపాటు డిఫెండర్ సాగర్ (8) అద్భుత ప్రదర్శన కనబర్చారు. టైటాన్స్‌లో రైడర్ పవన్(10), డిఫెండర్ అజిత్(7), ఆల్‌రౌండర్ హమిద్ నాడర్(6) మాత్రమే రాణించారు. ఈ సీజన్‌లో తెలుగు టైటాన్స్ ఇప్పటివరకు 16 మ్యాచ్‌లు ఆడగా, కేవలం రెండింట్లో మాత్రమే విజయం సాధించడం గమనార్హం. మిగతా అన్నింట్లోనూ ఓటమిపాలైంది. ఇక, అంతకన్నా ముందు జరిగిన మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్‌పై దబాంగ్ ఢిల్లీ 35-32 పాయింట్ల తేడాతో విజయం సాధించింది.




Next Story

Most Viewed