Sudirman Cup 2023: సుదిర్మన్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక

by Disha Web Desk 13 |
Sudirman Cup 2023: సుదిర్మన్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టు ఎంపిక
X

దిశ, వెబ్‌డెస్క్: మే 14 నుంచి 21 వరకు చైనాలోని సుజౌలో జరగనున్న ప్రపంచ బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ చాంపియన్‌షిప్‌ సుదిర్మన్‌ కప్‌లో పాల్గొనే భారత జట్టును ప్రకటించారు. పురుషుల, మహిళల సింగిల్స్, పురుషుల డబుల్స్, మహిళల డబుల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో ఒక్కో మ్యాచ్‌ జరుగుతుంది. గ్రూప్‌ ‘సి’లో మలేసియా, చైనీస్‌ తైపీ, ఆస్ట్రేలియా జట్లతో భారత జట్టు ఆడుతుంది.

భారత జట్టు:

పురుషుల సింగిల్స్: హెచ్‌ఎస్ ప్రణయ్, కిదాంబి శ్రీకాంత్ (రిజర్వ్: లక్ష్య సేన్)

మహిళల సింగిల్స్: పీవీ సింధు, అనుపమ ఉపాధ్యాయ (రిజర్వ్: ఆకర్షి కశ్యప్)

పురుషుల డబుల్స్: సాత్విక్‌సాయిరాజ్ రంకిరెడ్డి/చిరాగ్ శెట్టి, ఎంఆర్ అర్జున్/ధృవ్ కపిల

మహిళల డబుల్స్: గాయత్రి గోపీచంద్/ట్రీసా జాలీ, అశ్విని పొన్నప్ప/తనీషా క్రాస్టో

మిక్స్‌డ్ డబుల్స్: తనీషా క్రాస్టో/సాయి ప్రతీక్

Next Story

Most Viewed