క్వార్టర్స్‌కు శ్రీరామ్-జీవన్ జోడీ

by Harish |
క్వార్టర్స్‌కు శ్రీరామ్-జీవన్ జోడీ
X

చెన్నై: చెన్నై ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత ద్వయం, టాప్ సీడ్ శ్రీరామ్ బాలాజీ-జీవన్ క్వార్టర్స్‌కు చేరుకున్నారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌లో భారత జోడీ 6-4, 7-5 తేడాతో పోర్చుగల్-అమెరికా జంట ఫెరీరా సిల్వా-నికోలస్ మోరెనో అల్బోరాన్‌ను చిత్తు చేసింది. ప్రత్యర్థి జోడీ నుంచి తీవ్రమైన పోటీని ఎదురైనప్పటికీ శ్రీరామ్ బాలాజీ-జీవన్ జోడీ అద్భుతంగా ఆడి వరుస సెట్లను గెలుచుకున్నారు.

మరో భారత జంట సుమిత్ నగల్-శశికుమార్ ముకుంద్ సైతం క్వార్టర్స్‌కు చేరుకుంది. తైవాన్‌కు చెందిన యు హ్సియు హ్సు-క్రిస్టోఫర్ జోడీతో తలపడిన భారత జోడీ వాకోవర్ ద్వారా టోర్నీలో ముందడుగు వేసింది. ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను 7-6 తేడాతో దక్కించుకున్న భారత జోడీ.. రెండో సెట్‌లో 2-1తో ఆధిక్యంలో ఉండగా తైవాన్ జోడీ ఆట నుంచి నిష్క్రమించింది. సుమిత్-శశికుమార్ ద్వయం క్వార్టర్స్‌లో శ్రీరామ్ బాలాజీ-జీవన్ జోడీతో తలపడనున్నది.

Next Story

Most Viewed