IPL: ఇవాళ ఉప్పల్‌‌లో మ్యాచ్‌కు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

by Disha Web Desk 2 |
IPL: ఇవాళ ఉప్పల్‌‌లో మ్యాచ్‌కు వెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా ఇవాళ సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ముంబై ఇండియన్స్ జట్లు తలపనున్నాయి. రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో సన్ రైజర్స్ జట్టు యాజమాన్యం అభిమానులకు కీలక సూచనలు చేసింది. మైదానంలోకి వచ్చే వాళ్లు.. మద్యం సేవించి రావొద్దని సూచించింది. అంతేగాక, బైక్ హెల్మెట్లు, సెల్ఫీ స్టిక్, పవర్ బ్యాంక్, గొడుగు, ఇయర్ బర్డ్స్, లగేజీ బ్యాగ్స్, కెమెరాలు, లైటర్స్, కత్తులు వంటివి తీసుకు రావడానికి వీళ్లేదని హెచ్చరికలు జారీ చేసింది. సాయంత్రం 5 గంటల నుంచే మైదానంలోకి అనుమతి ఇస్తామని ప్రకటించింది. కాగా, ఈ సీజన్లో తొలి రెండు మ్యాచుల్లో ఇబ్బంది పడ్డ హైదరాబాద్‌ జట్టు తర్వాత ఫామ్‌లోకి వచ్చింది. వరుసగా రెండు విజయాలు సాధించింది. సేమ్ ముంబై కూడా మొదటి రెండు మ్యాచులు ఓటమి పాలై.. చివరి రెండు మ్యాచులు గెలిచింది. రెండు జట్లకు ఈ మ్యాచ్ కీలకం కాబోతోంది.



Next Story

Most Viewed