టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా..రంగంలోకి ముగ్గురు కొత్త ప్లేయ‌ర్లు

by velandi.Saikiran |   (  Updated:2025-12-19 13:18:49  IST  )

భారత్, దక్షిణాఫ్రికా మధ్య అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లోనే ఐదవ టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో

టాస్ గెలిచిన ద‌క్షిణాఫ్రికా..రంగంలోకి ముగ్గురు కొత్త ప్లేయ‌ర్లు
X

దిశ‌, వెబ్ డెస్క్‌: భారత్, దక్షిణాఫ్రికా మధ్య అహ్మదాబాద్ వేదికగా మరికాసేపట్లోనే ఐదవ టీ20 ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టాస్ నెగ్గిన దక్షిణాఫ్రికా, మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దక్షిణాఫ్రికా టాస్ గెలవడంతో, భారత జట్టు తొలుత బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో మూడు మార్పులతో భారత జట్టు బరిలోకి దిగనుంది. ముఖ్యంగా లెగ్ ఇంజురీ కారణంగా వైస్ కెప్టెన్ గిల్ జ‌ట్టుకు దూరమయ్యాడు. గిల్ స్థానంలో వికెట్ కీపర్ సంజు శాంసన్ తుది జట్టులోకి వచ్చాడు. అటు వాషింగ్టన్ సుందర్, బుమ్రా జట్టులోకి రీ-ఎంట్రీ ఇచ్చారు. దీంతో హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్ పై వేటు ప‌డింది. కాగా ఈ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు విజ‌యం సాధిస్తే, 3-1 తేడాతో సిరీస్ గెలిచే ఛాన్స్ ఉంది.

Next Story