260 పరుగుల వద్ద సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ లక్ష్యం 549 పరుగులు

by Malleboina Mahesh |

రెండో టెస్టుపై సౌతాఫ్రికా జట్టు పూర్తి ఆదిక్యాన్ని కొనసాగిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది.

260 పరుగుల వద్ద సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ లక్ష్యం 549 పరుగులు
X

దిశ, వెబ్‌డెస్క్: రెండో టెస్టుపై సౌతాఫ్రికా జట్టు పూర్తి ఆదిక్యాన్ని కొనసాగిస్తుంది. మొదటి ఇన్నింగ్స్ లో 489 పరుగులు చేసిన ఆ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. స్టబ్స్ 94 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. ఈ రెండో ఇన్నింగ్స్ లో రవీంద్ర జడేజా 4 వికెట్లు తీసుకున్నాడు. కాగా ఈ మ్యాచులో భారత్ విజయం సాధించాలంటే 108 ఓవర్లలో 549 పరుగులు చేయాల్సి ఉంది. మరి ఈ మ్యాచులో భారత్ ఎదుట ఉన్న భారీ స్కోరును బ్యాటర్లు చేధిస్తారా.. లేక మొదటి ఇన్నింగ్స్ లో అవుట్ అయినట్లే వెంట వెంటనే వికెట్లు కోల్పోయి.. ఈ టెస్టులో కూడా ఓడిపోయి.. సిరీస్ ను చేజార్చుకుంటారో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

Next Story