IPL: ముంబై ఇండియన్స్‌తో బంధం కట్.. రంగంలోకి మరో ప్రముఖ..

by Web Desk |
IPL: ముంబై ఇండియన్స్‌తో బంధం కట్.. రంగంలోకి మరో ప్రముఖ..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉంటుంది. దీనిని యాడ్‌ల రూపంలో క్యాష్ చేసుకోవడానికి బడా బడా కంపెనీలు పోటీపడుతుంటాయి. ఐపీఎల్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ ముంబై ఇండియన్స్‌కు గత నాలుగు సంవత్సరాల నుండి దిగ్గజ మొబైల్ తయారీ సంస్థ సామ్సంగ్ టైటిల్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఈ ఏడాదితో వీరి ఒప్పందం ముగిసింది. కాగా, సామ్సంగ్ పక్కకు తప్పుకుంది. దీనితో ప్రముఖ క్రెడిట్ కార్డ్‌ల సంస్థ 'స్లైస్' ముంబై ఇండియన్స్‌తో మూడు సంవత్సరాలకు గాను ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి గాను ముంబైకి 90 కోట్లు చెల్లించినట్లు సమాచారం. ఇకపై ముంబై ఆటగాళ్ల జెర్సీపై సామ్సంగ్ స్థానంలో స్లైస్ కనబడనుంది.




Next Story

Most Viewed