ఐర్లాండ్‌‌పై సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు..

by Disha Web Desk 13 |
ఐర్లాండ్‌‌పై సెంచరీలతో చెలరేగిన లంక ఓపెనర్లు..
X

దిశ, వెబ్‌డెస్క్: ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారీ స్కోరు దిశగా సాగుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్‌ నష్టానికి 357 పరుగులు చేయగా.. నిషాన్‌ మధుష్క 149 బ్యాటింగ్‌, కుషాల్‌ మెండిస్‌ 83 బ్యాటింగ్‌ క్రీజులో ఉన్నారు. అంతకముందు శ్రీలంక ఓపెనర్లు దిముత్‌ కరుణరత్నే (133 బంతుల్లో 115 పరుగులు, 15 ఫోర్లు), నిషాన్‌ మధుష్క 234 బంతుల్లో 149 బ్యాటింగ్‌, 18 ఫోర్లు, ఒక సిక్సర్‌) సెంచరీలతో చెలరేగారు. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు రికార్డు స్థాయిలో 228 పరుగులు జోడించారు.

Next Story