- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
క్వార్టర్స్లో ముగిసిన శరత్ కమల్ పోరాటం
by Harish |
సింగపూర్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ జోరుకు క్వార్టర్ ఫైనల్స్లో బ్రేక్ పడింది.

X
దిశ, స్పోర్ట్స్ : సింగపూర్లో జరుగుతున్న సింగపూర్ స్మాష్ టేబుల్ టెన్నిస్ టోర్నీలో భారత స్టార్ ఆటగాడు ఆచంట శరత్ కమల్ జోరుకు క్వార్టర్ ఫైనల్స్లో బ్రేక్ పడింది. శుక్రవారం జరిగిన మెన్స్ సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో శరత్ కమల్ 1-4(9-11, 2-11, 7-11, 11-9, 8-1) తేడాతో ఫ్రాన్స్ ఆటగాడు ఫెలిక్స్ లెబ్రాన్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ప్రత్యర్థి దూకుడుగా ఆడగా శరత్ కమల్ పోరాడినప్పటికీ ఫలితం దక్కలేదు. వరుసగా మూడు గేమ్లు కోల్పోయిన అతను నాలుగో గేమ్ నెగ్గినా అప్పటికే అతని ఓటమి ఖరారైంది. ఐదో గేమ్ను కూడా కోల్పోయి మ్యాచ్ను ప్రత్యర్థికి సమర్పించుకున్నాడు. కాగా, ఈ టోర్నీలో 41 ఏళ్ల శరత్ కమల్ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. తొలి మూడు రౌండ్లలో తన కంటే మెరుగైన ర్యాంకర్లను ఓడించాడు.
Next Story






