పంత్ వికెట్.. ఛీ ఛీ అంటూ వెళ్లిపోయిన సంజీవ్‌ గోయెంకా!

by velandi.Saikiran |   (  Updated:2025-05-19 21:30:34  IST  )

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మరోసారి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మొన్నటి

పంత్ వికెట్.. ఛీ ఛీ అంటూ వెళ్లిపోయిన సంజీవ్‌ గోయెంకా!
X

దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో మరోసారి లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ దారుణంగా విఫలమయ్యాడు. మొన్నటి మెగా వేలంలో 27 కోట్లు పలికిన పంత్ ( Rishabh Pant).. ఇప్పటివరకు పెద్దగా మెరువలేదు. ప్రతి మ్యాచ్ లో... దారుణంగా విఫలమవుతున్నాడు. తాజాగా జరిగిన హైదరాబాద్ వర్సెస్ లక్నో మ్యాచ్ లో కూడా... లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ నిరాశపరిచాడు.

ఈ మ్యాచ్ లో ఆరు బంతులు ఆడిన పంత్... కేవలం ఏడు పరుగులు మాత్రమే చేశారు. ఇందులో ఒకే ఒక్క బౌండరీ ఉంది. అయితే... మలింగ బౌలింగ్ లో పంత్ కాటన్ బౌల్డ్ కావడంతో.. లక్నో ఓనర్ సంజీవ్ ( Sanjiv Goenka) షాకింగ్ రియాక్షన్ ఇచ్చారు. అప్పటివరకు బాల్కనీలో ఉన్న సంజీవ్... లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ వికెట్ కోల్పోగానే వెంటనే... డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లిపోయాడు. పంత్ ఏ మాత్రం సరిగ్గా ఆడడం లేదని... తన కదలికలతో... అందరికీ అర్థమయ్యేలా చేశాడు సంజీవ్. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కాగా ఈ మ్యాచ్ లో ఓడిపోయిన లక్నో ఇంటిదారి పట్టింది.

Next Story