మైదానంలోకి మళ్ళీ అడుగుపెట్టనున్న మాస్టర్ బ్లాస్టర్ Sachin Tendulkar

by Disha Web Desk 16 |
మైదానంలోకి  మళ్ళీ అడుగుపెట్టనున్న మాస్టర్ బ్లాస్టర్ Sachin Tendulkar
X

న్యూఢిల్లీ: టీమ్ ఇండియా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తిరిగి మైదానంలోకి అడుగుపెట్టనున్నారు. సెప్టెంబర్ 10 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు జరిగే రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ సీజన్-2‌లో ఇండియన్ లెజెండ్స్ జట్టుకు మరోసారి సచిన్ టెండూల్కర్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. కాన్ఫూర్, రాయ్‌పూర్, ఇండోర్, డెహ్రాడూన్‌ వేదికకగా ఈ మ్యాచులు జరగనున్నాయి. ఈ సిరీస్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ ఇండియన్ లెజెండ్స్‌తోపాటు శ్రీలంక, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, సౌతాఫ్రికా, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ జట్లు పాల్గొననున్నాయి. అయితే ఈ ఎడిషన్‌లో కొత్తగా న్యూజిలాండ్ టీమ్ యాడ్ అయింది. దీంతో మొత్తం జట్ల సంఖ్య 8కి చేరింది. రోడ్ అండ్ సేఫ్టీపై ప్రపంచవ్యాప్తంగా అవగాహన పెంచేందుకు కేంద్ర రోడ్డు రవాణా, హైవేలు, ఐటీ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో ఈ సిరీస్‌ను నిర్వహిస్తున్నారు. కాగా, రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ తొలి సీజన్‌లో సచిన్ టెండూల్కర్ సారథ్యంలో ఇండియన్ లెజెండ్స్ జట్టు శ్రీలంక లెజెండ్స్ టీమ్‌ను ఓడించి విజేతగా నిలిచింది.

Next Story

Most Viewed