- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ధర్మశాల: సెంచరీలతో అదరగొట్టిన రోహిత్ శర్మ, గిల్
by GSrikanth |
ఇంగ్లాండ్తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటుతున్నారు.

X
దిశ, వెబ్డెస్క్: ఇంగ్లాండ్తో ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో టీమిండియా బ్యాటర్లు సత్తా చాటుతున్నారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ ఇద్దరూ సెంచరీలు బాదారు. టెస్టు కెరియర్లో రోహిత్ 12వ సెంచరీ నమోదు చేయడా.. గిల్ నాలుగో సెంచరీని సాధించారు. ప్రస్తుతం ఇద్దరూ క్రీజులో కొనసాగుతున్నారు. రోహిత్తో పాటు ఓపెనర్గా వచ్చిన యశస్వి జైస్వాల్ కూడా అర్ధ సెంచరీతో రాణించారు. అయితే, ఈ టెస్టులో టాస్ ఓడిన భారత్ ముందు బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జాక్ క్రాలీ(79) తప్పా మిగతా ఆటగాళ్లంతా విఫలమయ్యారు. అందరూ తక్కువ స్కోరుకే పెవీలియన్ చేరడంతో ఇంగ్లాండ్ 57.4 ఓవర్లో 218 పరుగులకే ఆలౌటైంది. దీంతో చేధనలో బ్యాటింగ్కు దిగిన భారత్ రాణిస్తోంది. ప్రస్తుతం ఒక వికెట్ కోల్పోయి 50 పరుగుల లీడ్లో కొనసాగుతోంది.
Next Story






