అదరగొడుతున్న బోపన్న జోడీ

by Dishanational3 |
అదరగొడుతున్న బోపన్న జోడీ
X

దిశ, స్పోర్ట్స్ : 44 ఏళ్ల వయసులో భారత టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న అదరగొడుతున్నాడు. ఇటీవలే ఆస్ట్రేలియా ఓపెన్ మెన్స్ డబుల్స్ చాంపియన్‌గా నిలిచిన అతను అమెరికాలో జరుగుతున్న మియామి ఓపెన్‌ టోర్నమెంట్‌లో సత్తాచాటుతున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బోపన్న ఈ టోర్నీలో సెమీస్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బోపన్న జోడీ 3-6, 7-6(7-4), 10-7 తేడాతో సెమ్ వెర్బీక్(నెదర్లాండ్స్)-జాన్ పాట్రిక్ స్మిత్(ఆస్ట్రేలియా) జంటను చిత్తు చేసింది. తొలి సెట్‌ కోల్పోయిన తర్వాత బోపన్న ద్వయం అద్భుతంగా పుంజుకుంది. హోరాహోరీగా సాగిన మిగతా రెండు సెట్లను సొంతం చేసుకుని సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఫైనల్ బెర్త్ కోసం సెమీస్‌లో బోపన్న జోడీ.. గ్లాస్‌పూల్-రోజ‌ర్(జర్మనీ) లేదా గ్రానొల్లెర్స్(స్పెయిన్), జెబ‌ల్లోస్(అర్జెంటీనా) జోడీతో తలపడనుంది.


Next Story

Most Viewed