WTC Final మ్యాచ్‌కు అజింకా రహానే ఎంపికపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్

by Disha Web Desk 13 |
WTC Final మ్యాచ్‌కు అజింకా రహానే ఎంపికపై రికీ పాంటింగ్ ఆసక్తికర కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ ముగిసిన తర్వాత ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2023 మ్యాచ్ ఆడనుంది టీమిండియా. అజింకా రహానేతో పాటు ఛతేశ్వర్ పూజారా టెస్టు టీమ్‌లోకి తిరిగి రాగా శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, అజింకా రహానే బీభత్సమైన ఫామ్‌లో ఉండడం టీమ్‌కి కలిసి వచ్చే విషయం. వీరితో పాటు మహ్మద్ షమీ, సిరాజ్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు. అయితే శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, కెఎల్ రాహుల్, జస్ప్రిత్ బుమ్రా వంటి కీ ప్లేయర్లు గాయపడినా టీమిండియా పటిష్టంగానే కనబడుతోంది.

ఈ నేపథ్యంలో అజింకా రహానే ఎంపికపై రికీ పాంటింగ్ సంచలన కామెంట్ చేశాడు. ఐపీఎల్‌లో అజింకా రహానే అద్భుతంగా ఆడాడని టెస్టుల్లోకి తిరిగి తీసుకురావడం కాస్త వింతగా ఉందన్నారు. రెండు ఫార్మాట్లు పూర్తిగా భిన్నమైనవి. అయితే రహానే కొన్నేళ్లుగా టెస్టుల్లో పెద్దగా రాణించలేకపోయాడు.


Next Story

Most Viewed