- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నాగపూర్ పిచ్పై వస్తున్న విమర్శలకు రవీంద్ర జడేజా కౌంటర్..
దిశ, వెబ్డెస్క్: నాగపూర్ పిచ్పై వస్తున్న విమర్శలకు టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా స్పందించాడు. ఆసీస్ పై విజయం సాధించడంలో జడేజా కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ టెస్టులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను సొంతం చేసుకున్నాడు. అయితే నాగపూర్ పిచ్పై ఆసీస్ మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. దీనిపై జడేజా దీటుగా స్పందించాడు. "ఆ పర్యాటకులు పిచ్ పై ఉన్న గుంతలను భారత్కు వచ్చేటప్పుడు విమానంలోంచి చూసి ఉంటారు" అంటూ ఎద్దేవా చేశాడు. ఆసీస్ బ్యాటర్స్ ఎక్కువమంది తాము స్పిన్ లేకుండా నేరుగా విసిరిన బంతులకే అవుటయ్యారని తెలిపాడు.
టీమిండియా బలం స్పిన్ అయినప్పుడు మన బౌలర్లకు అనుకూలించేలా పిచ్లు తయారు చేయడంలో తప్పు లేదని స్పష్టం చేశాడు. గతంలో తాము ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లినప్పుడు అక్కడ పచ్చికతో కూడిన గ్రీన్ టాప్ పిచ్లను ఏర్పాటు చేశారని, కానీ తాము ఎప్పుడూ ఆ అంశం పై ఫిర్యాదు చేయలేదని జడేజా వెల్లడించాడు. ఆస్ట్రేలియాలో పిచ్లపై 18-20 మిల్లీమీటర్ల పరిమాణంలో గడ్డి ఉండేదని.. అలాంటప్పుడు వారు కూడా భారత్ వచ్చినప్పుడు ఇక్కడి పిచ్లపై మాట్లాడకుండా ఉంటే బాగుంటుందని హితవు పలికాడు.