ఆసియా కప్ ప్రారంభానికి ముందే Team India కు బిగ్ షాక్..

by Disha Web Desk 19 |
ఆసియా కప్ ప్రారంభానికి ముందే Team India కు బిగ్ షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రతిష్టాత్మక ఆసియా కప్ టోర్నికి ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్‌కు కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ద్రావిడ్ ఈ నెల 27 నుండి ప్రారంభంకానున్న ఆసియా కప్ టోర్నికి దూరం కానున్నాడు. ఆ విషయాన్ని బీసీసీఐ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. కాగా, యూఏఈ వేదికగా ఆసియా కప్ 2022 టోర్ని జరగనుంది. ఈ టోర్ని ఆగస్ట్ 27వ తేదీ నుండి ప్రారంభం కానుండగా.. ఇండియా తన తొలి మ్యాచ్‌ను 28వ తేదీన పాక్‌తో తలపడనుంది. చాలా కాలం తర్వాత మళ్లీ భారత్, పాక్ తలపడుతుండటంతో క్రికెట్ ప్రియులు ఈ మ్యాచ్ కోసం ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు.



Next Story

Most Viewed