- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బాక్సింగ్ ఫెడరేషన్లో అడ్ హక్ కమిటీ ఏర్పాటు
వ్యక్తిగత ఆసక్తులను పక్కన పెట్టి అందరం భారత క్రీడాలోకం కోసం పని చేద్దామని ఉష సూచించారు.

- పీటీ ఉష నిర్ణయంపై హైకోర్టు స్టే
- ఉష తీరుపై గగన్ నారంగ్ మండిపాటు
- తన నిర్ణయాన్ని సమర్థించుకున్న పీటీ ఉషా
దిశ, స్పోర్ట్స్: బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు అడ్-హక్ కమిటీని ఏర్పాటు చేయడాన్ని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (ఐఓఏ) ప్రెసిడెంట్ పీటీ ఉష సమర్థించుకున్నారు. బీఎఫ్ఐ తమ ప్రాథమిక బాధ్యతలను విస్మరించిందని, అందుకే పాలనను చక్కదిద్దాలనే ఉద్దేశంతోనే అడ్-హక్ కమిటీని ఏర్పాటు చేశామని మంగళవారం పీటీ ఉష వెల్లడించారు. ఫిబ్రవరి 28న ఐఓఏ వైస్ ప్రెసిడెంట్ గగన్ నారంగ్ అడ్-హక్ కమిటీ ఏర్పాటు విషయంలో పీటీ ఉష ఏకపక్ష ధోరణిని ఎండగడుతూ లేఖ రాశారు. ఆమె చర్యల వల్ల అథ్లెట్ల సంక్షేమం మరుగున పడుతుందని దుయ్యబట్టారు. అడ్-హక్ కమిటీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీఎఫ్ఐ పిటిషన్ మేరకు ఢిల్లీ హైకోర్టు కూడా ఐఓఏ ఉత్తర్వులపై సమాధానం ఇవ్వాలని కోరింది. కాగా ఈ విషయంపై పీటీ ఉష స్పందిస్తూ.. అడ్-హక్ కమిటీ ఏర్పాటు వల్ల అథ్లెట్లు ఇబ్బందులు పడుతున్నారని గగన్ నారంగ్ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. కమిటీ ఏర్పాటు ఏకపక్ష నిర్ణయం కాదని. అది తప్పని సరిగా తీసుకోవాల్సిన చర్య అని ఉష పేర్కొన్నారు. అథ్టెట్ల మంచి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఏసియన్ గేమ్స్ 2026 సమీపిస్తున్నా.. ఇంకా ఫ్రెష్ టాలెంట్ను వెతకడానికి ఎలాంటి ప్రయత్నాలు బీఎఫ్ఐ చేయడం లేదని ఉష ఆరోపించారు. వ్యక్తిగత ఆసక్తులను పక్కన పెట్టి అందరం భారత క్రీడాలోకం కోసం పని చేద్దామని ఉష సూచించారు.






