WPL వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్స్

by Disha Web Desk 12 |
WPL వేలంలో అత్యధిక ధర పలికిన విదేశీ ప్లేయర్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమెన్స్ ప్రీమియమ్ లీగ్.. వేలం ఫిబ్రవరి 13న ముంబైలో అట్టహాసంగా సాగింది. సుమారు 450 మంది ప్లేయర్లు ఈ వేలానికి సెలెక్ట్ కాగా.. ఎక్కువగా భారత ప్లేయర్లను కొనేందునే అన్ని టీమ్‌లు పోటీ పడ్డాయి. అలాగే ప్రపంచవ్యాప్తంగా వివిధ టీ20 టోర్నిలలో పేరుగాంచిన విదేశీ ప్లేయర్లు కూడా మంచి డిమాండ్ దక్కింది.

ఈ క్రమంలో నిన్న జరిగిన WPL ప్రారంభ వేలంలో ఆస్ట్రేలియాకు చెందిన ప్రపంచ నంబర్ వన్ T20I ఆల్-రౌండర్ ఆష్లీ గార్డనర్, అలాగే ఇంగ్లాండ్ ఆల్-రౌండర్ నాట్ స్కివర్-బ్రంట్ ఈ వేలంలో అత్యంత ఖరీదైన విదేశీ ప్లేయర్లు గా నిలిచారు. యాష్లీగ్‌ను గుజరాత్ జెయింట్స్ ₹3.2 కోట్లకు కొనుగోలు చేయగా, నాట్‌ను ముంబై ఇండియన్స్ ₹3.2 కోట్లకు కొనుగోలు చేశారు. అలాగే వీరి తర్వాత ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బెత్ మూనీని గుజరాత్ జెయింట్స్ ₹2 కోట్లు పలికింది.

Next Story