పాక్ ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్

by Harish |

పాక్ ఖేల్ ఖతం.. టీ20 వరల్డ్ కప్ నుంచి ఔట్
X

దిశ, స్పోర్ట్స్ : టీ20 వరల్డ్ కప్‌‌లో పాకిస్తాన్ కథ ముగిసింది. సూపర్-8 రౌండ్‌లోనే ఆ జట్టు ఇంటిదారిపట్టబోతోంది. ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో పాక్ 8 వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది. ఛేదనలో శ్రీలంకను 148 రన్స్ లేదా అంతకంటే తక్కువ స్కోరుకు కట్టడి చేస్తే పాక్ సెమీస్‌కు వెళ్లేది. కానీ, 16 ఓవర్లు ముగిసే సమయానికి శ్రీలంక 150/5 స్కోరు చేయడంతో పాక్ ఆశలు గల్లంతయ్యాయి. పవన్ రత్నాయాకే మెరుపు హాఫ్ సెంచరీకితోడు కెప్టెన్ షనక కూడా రెచ్చిపోవడంతో పాక్‌కు షాక్ తప్పలేదు. ఇక ఈ మ్యాచ్‌లో పాక్ గెలిచినా ప్రయోజనం లేదు. దీంతో మెరుగైన నెట్‌రన్‌రేట్‌తో న్యూజిలాండ్ సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఒకవేళ పాక్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే.. పాక్, న్యూజిలాండ్ ఖాతాలో చెరో 3 పాయింట్లు ఉంటాయి. కానీ, నెట్‌రన్‌రేట్ పరంగా కివీస్ ముందడుగు వేస్తుంది.

Next Story