ఒక్క పరుగు చేయకుండానే 2 వికెట్లు కోల్పోయిన పాక్

by GSrikanth |
ఒక్క పరుగు చేయకుండానే 2 వికెట్లు కోల్పోయిన పాక్
X

దిశ, వెబ్‌డెస్క్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఒక్క పరుగు చేయకుండానే పాకిస్తాన్ ఓపెనర్లు వెనుదిరిగారు. కివీస్ విధించిన 319 టార్గెట్‌ను రెండ్రోజుల్లో చేజింగ్ చేయడం సులువు అనుకున్న పాక్ అభిమానులను ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (0), మీర్ హంజా(0), నిరాశపర్చారు. ప్రస్తుతం క్రీజులో ఇమామ్ అల్ హక్, షాన్ మసూద్ ఉన్నారు. అంతకముందు బ్యాటింగ్ చేసిన కివీస్ బ్యాటర్లలో లాథమ్ (62), విలియమ్సన్ (41), బ్లండెల్(74), బ్రాస్‌వెల్(74) పరుగులతో చెలరేగడంతో 277 పరుగులు చేసి, మొత్తం పాకిస్తాన్‌కు 319 పరుగుల లక్ష్యాన్ని విధించింది. దీంతో మొదటి టెస్టు డ్రా కావడంతో ఈ మ్యాచ్‌ ఎలాగైనా గెలవాలని పాక్ చూస్తోంది.

Also Read...

ఆటగాడి పేరుకు బదులు పోర్న్ స్టార్ పేరు పలికిన కామెంటర్

Next Story