శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను అందుకే ఎంపిక చేయలేదు : రాహుల్ ద్రవిడ్

by Dishanational3 |
శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌లను అందుకే ఎంపిక చేయలేదు : రాహుల్ ద్రవిడ్
X

దిశ, స్పోర్ట్స్ : ఆఫ్ఘనిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు శ్రేయస్ అయ్యర్, ఇషాన్‌ కిషన్‌లను ఎంపిక చేయకపోవడం అందరినీ ఆశ్చర్యపర్చింది. దీంతో పలువురు మాజీ క్రికెటర్లు సెలెక్టర్లపై ప్రశ్నల వర్షం కురిపించారు. మరోవైపు, క్రమశిక్షణ చర్యల్లో భాగంగా వీరిని సెలెక్టర్లు పక్కనపెట్టారని వార్తలు వచ్చాయి. తాజాగా వీరిని ఎంపిక చేయకపోవడంపై టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ క్లారిటీ ఇచ్చాడు. అయ్యర్, ఇషాన్ కిషన్‌లపై వచ్చిన క్రమశిక్షణారాహిత్యం వార్తలను ద్రవిడ్ కొట్టిపారేశాడు. అలాంటిదేమీ లేదని స్పష్టతనిచ్చాడు. ‘సౌతాఫ్రికా పర్యటనలో ఇషాన్ కిషన్ విశ్రాంతి కావాలని అభ్యర్థించాడు. మేము అంగీకరించాం. ఈ సిరీస్‌కు కూడా అతను సెలెక్షన్‌కు అందుబాటులో లేదు. అయ్యర్‌ను జట్టులోకి తీసుకోకపోవడానికి ఎలాంటి క్రమశిక్షణాపరమైన కారణం లేదు. సెలెక్టర్లతో కూడా నేను ఆ విషయంపై మాట్లాడలేదు. జట్టులో చాలా పోటీ ఉండటంతో అతను తప్పుకోవాల్సి వచ్చింది. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌లోనూ అతను ఆడలేదు. జట్టులో చాలా మంది బ్యాటర్లు ఉన్నారు. అందరికీ అవకాశం ఇవ్వడం సాధ్యం కాదు.’ అని ద్రవిడ్ చెప్పుకొచ్చాడు.


Next Story

Most Viewed