ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నీతు ఘంఘాస్

by Dishafeatures2 |
ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ గా నీతు ఘంఘాస్
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీలో జరుగుతోన్న మహిళల ప్రపంచ బాక్సింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత స్టార్‌ బాక్సర్‌ నీతు ఘంఘాస్ సత్తా చాటారు. 48 కేజీల విభాగంలో ఇవాళ జరిగిన ఫైనల్ మ్యాచ్ లో మంగోలియన్ బాక్సర్ లుత్సాయిఖాన్‌పై 5-0 తేడాతో అద్భుత ప్రదర్శన కనబరిచి బంగారు పతకాన్ని గెలుచుకున్నారు. అంతకు ముందు జరిగిన సెమీ-ఫైనల్స్‌లో కజకిస్థాన్‌కు చెందిన అలువా బల్కెకోవాను ఓడించి నీతు ఘంఘాస్ ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. మహిళా విభాగంలో దేశం నుంచి బాక్సింగ్ గోల్డ్ మెడల్ సాధించిన వారిలో నీతు 6వ వ్యక్తిగా నిలిచి రికార్డు సృష్టించారు. ఇక ఘంఘాస్ గోల్డ్ మెడల్ గెలవడం పట్ల ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.



Next Story

Most Viewed