మళ్లీ రెండో స్థానంలోనే నీరజ్ చోప్రా

by Ajay Maddhiboyina |   (  Updated:2025-05-23 19:27:48  IST  )

పోలండ్‌లో జరిగిన జనుస్జ్ కుసోసిన్‌కి మెమోరియల్ మీట్ 2025 నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు.

మళ్లీ రెండో స్థానంలోనే నీరజ్ చోప్రా
X

దిశ, వెబ్ డెస్క్: పోలండ్‌లో జరిగిన జనుస్జ్ కుసోసిన్‌కి మెమోరియల్ మీట్ 2025లో నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచాడు. ఆరో రౌండ్‌లో నీరజ్ జావెలిన్‌ను 84.14 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు. మరోవైపు జర్మనీ అథ్లెట్ జూలియన్ వెబర్ జావెలిన్‌ను 86.12 మీటర్లు విసిరి మొదటి స్థానంలో నిలిచాడు. ఇక ఇటీవల దోహా డైమండ్ లీగ్‌లో కూడా వెబర్ 91.6 మీటర్ల దూరం విసిరి మొదటి స్థానంలో నిలవగా నీరజ్ 90.23 మీటర్లు విసిరి రెండో స్థానంలో నిలిచాడు. తాజాగా మరోసారి నీరజ్ రెండో స్థానానికి పరిమితం అవ్వడంతో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు .

Next Story