Ind vs Pak : ప‌స‌లేదు...దుబాయ్ స్టేడియం బ‌య‌ట ఇది ప‌రిస్థితి

by velandi.Saikiran |

పాకిస్థాన్‌, భార‌త్ మ‌ధ్య క్ష‌ణాల్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది చాలా త‌క్కువ సంఖ్య‌లోనే ప్రేక్ష‌కులు వ‌స్తున్న వీడియో

Ind vs Pak : ప‌స‌లేదు...దుబాయ్ స్టేడియం బ‌య‌ట ఇది ప‌రిస్థితి
X

దిశ‌, వెబ్ డెస్క్ : ఆసియా క‌ప్ 2025 టోర్న‌మెంట్ లో భాగంగా పాకిస్థాన్‌, భార‌త్ మ‌ధ్య మ‌రికొన్ని క్ష‌ణాల్లోనే మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేప‌థ్యంలో... టికెట్లు కూడా సేల్ కాలేద‌ని అంటున్నారు. దుబాయ్ వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచ్ కు సెల‌బ్రీటీలు, బీసీసీఐ అధికారులు కూడా దూరంగా ఉంటున్నార‌ని స‌మాచారం. ఇటీవ‌లే పుల్వామాలో జ‌రిగిన దాడి నేప‌థ్యంలో..ఈ మ్యాచ్ ను బాయ్ కాట్ చేస్తున్నారు ఇండియ‌న్స్‌.

దీంతో టికెట్లు కూడా చాలా మంది కొనుగోలు చేయలేద‌ని అంటున్నారు. అయితే.. దానికి త‌గ్గ‌ట్టుగానే... దుబాయ్ స్టేడియం బ‌య‌ట కూడా ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ప్రేక్ష‌కులు పెద్ద‌గా స్టేడియం ద‌గ్గ‌ర క‌నిపించ‌డం లేదు. ఇండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్ ఎక్క‌డ జ‌రిగినా.. స్టేడియం బ‌య‌ట ఇసుక వేస్తే రాల‌నంతా జ‌నాలు ఉంటారు. కానీ ఇప్పుడు ఎవ‌రూ చూడ‌డానికి రావ‌డం లేదు. చాలా త‌క్కువ సంఖ్య‌లోనే ప్రేక్ష‌కులు వ‌స్తున్న వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. దీంతో మ్యాచ్ లో ప‌స‌లేద‌ని అంటున్నారు. క్లిక్

Next Story