AsiaCup: ఫైనల్‌లో శ్రీలంకను చావుదెబ్బ కొట్టిన సిరాజ్

by Disha Web Desk 2 |
AsiaCup: ఫైనల్‌లో శ్రీలంకను చావుదెబ్బ కొట్టిన సిరాజ్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆసియాకప్‌లో ఫైనల్ మ్యాచ్‌లో భాగంగా శ్రీలంకతో జరుగుతున్న మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభిస్తున్నారు. ఒకే ఓవర్‌లో మహమ్మద్ సిరాజ్ ఏకంగా ఐదు వికెట్లు తీసి శ్రీలంకను చావుదెబ్బ కొట్టాడు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న శ్రీలంక నాలుగు ఓవర్లలో 12 పరుగులు మాత్రమే చేసి ఏకంగా ఆరు వికెట్లు కోల్పోయింది. మరో వికెట్‌ను టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బూమ్రా తీశాడు. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరిగే ఆసియా కప్ ఫైనల్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ శ్రీలంకతో భారత్ తలపడుతోంది. టాస్ పడిన కొద్దిసేపటికే వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ కొద్దిగా ఆలస్యం కానుంది.

Next Story