మిథాలీ రాజ్ రిటైర్మెంట్..? డిసైడ్ చేయనున్న వరల్డ్ కప్

by Web Desk |
మిథాలీ రాజ్ రిటైర్మెంట్..? డిసైడ్ చేయనున్న వరల్డ్ కప్
X

న్యూఢిల్లీ : టీం ఇండియా ఉమెన్స్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ పై మరోసారి ఊహగానాలు జోరందుకున్నాయి. వరల్డ్ కప్ తర్వాత ఆమె అంతర్జాతీయ ఫార్మాట్స్ అన్నింటికీ రిటైర్మెంట్ ప్రకటిస్తుందని చర్చ జరుగుతోంది. దీనిపై తాజాగా స్పందించిన మిథాలీరాజ్.. ప్రస్తుతం తాను ఫిబ్రవరిలో న్యూజిలాండ్‌తో జరగనున్న ఒక టీ20, ఐదు వన్డేలతో పాటు మార్చిలో ప్రారంభమయ్యే మహిళల ప్రపంచ కప్ టోర్నీ పై దృష్టి సారించినట్లు స్పష్టం చేశారు.

మ్యాచ్ ప్రారంభం అయ్యాక అక్కడ జరిగే పరిణామాల ఆధారంగా తన నిర్ణయం ఉంటుందని మిథాలీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, 39 ఏళ్ల మహిళా జట్టు కెప్టెన్ 2019లో కీలక ప్రకటన చేశారు. మహిళల వరల్డ్ కప్ తర్వాత తన రిటైర్మెంట్ ఉంటుందని ప్రకటించగా.. దీనిపై అభిమానులు మరోసారి చర్చ లేవనెత్తారు. ఇండియా ప్రపంచ కప్ కొడితే ఇంకొంత కాలం మిథాలీ జట్టుకు సేవలందిస్తుందని టాక్ వినిపిస్తోంది.

Next Story

Most Viewed