ఒలింపిక్ పతకం మిస్ అవ్వడం కలచివేసింది: లక్ష్య సేన్

by Malleboina Mahesh |

భారత అగ్రశ్రేణి షట్లర్ లక్ష్య సేన్, పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకాన్ని స్వల్ప తేడాతో కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని తాజాగా అంగీకరించారు.

ఒలింపిక్ పతకం మిస్ అవ్వడం కలచివేసింది: లక్ష్య సేన్
X

దిశ, వెబ్ డెస్క్: భారత అగ్రశ్రేణి షట్లర్ లక్ష్య సేన్ (Lakshya Sen,), పారిస్ ఒలింపిక్స్ 2024లో పతకాన్ని స్వల్ప తేడాతో కోల్పోవడం తనను ఎంతగానో కలచివేసిందని తాజాగా అంగీకరించారు. పురుషుల సింగిల్స్ కాంస్య పతకం మ్యాచ్‌లో మలేషియాకు చెందిన లీ జి జియా చేతిలో ఓడిపోయిన సేన్, పతకానికి చాలా దగ్గరగా వచ్చి దాన్ని అందుకోలేకపోవడం తీవ్రంగా బాధించిందని తాజాగా ఆయన ఓ వీడియోలో మాట్లాడారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఆయన మాట్లాడుతూ.. నిరాశ నుండి బయటపడి, కోర్టులో వంద శాతం ప్రదర్శన ఇచ్చే ప్రేరణను తిరిగి పొందడానికి తనకు కొంత సమయం పట్టిందని లక్ష్య సేన్ తెలిపారు.

"పతకానికి దగ్గరగా వచ్చి దక్కకపోవడం నన్ను కొద్దిగా ప్రభావితం చేసింది," అని లక్ష్య సేన్ పేర్కొన్నారు. ఆ ప్రభావం నుంచి తేరుకుని, పూర్తి ఫిట్‌నెస్‌ను తిరిగి సాధించి, టోర్నమెంట్‌లలో తిరిగి పాల్గొనడానికి సమయం పట్టిందన్నారు. దీంతోపాటు, టోర్నమెంట్‌లలో వరుసగా తనవైపు ఫలితాలు రాలేదని, ప్రారంభంలో తన ఆట తీరు కూడా అనుకూలంగా లేదని ఆయన వివరించారు. కాగా ఈ వ్యాఖ్యలు, ఒలింపిక్స్‌లో పతకం కోల్పోయిన తర్వాత ఓ అగ్రశ్రేణి క్రీడాకారుడు ఎదుర్కొన్న మానసిక, శారీరక సవాళ్లను ప్రతిబింబిస్తున్నాయి.

Next Story