- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

X
దిశ, స్పోర్ట్స్ : ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ కోచ్ కీరన్ పొలార్డ్కు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ జరిమానా విధించింది. పంజాబ్ కింగ్స్తో గురువారం జరిగిన మ్యాచ్లో అతను ఫోర్త్ అంపైర్ను దూషించినందుకు చర్యలు తీసుకుంది. అతని మ్యాచ్ ఫీజులో 15 శాతం కోతపెట్టడమే కాకుండా ఓ డీమెరిట్ పాయింట్ కేటాయించింది. ముంబై ఇన్నింగ్స్లో 19వ ఓవర్లో పొలార్డ్ ఫోర్త్ అంపైర్తో వాగ్వాదానికి దిగాడు. ఈ సందర్భంగా ఫోర్త్ అంపైర్తో దురుసుగా ప్రవర్తించడమే కాకుండా అసభ్య పదజాలం వాడినట్టు ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిలోని ఆర్టికల్ 2.3ని పొలార్డ్ ఉల్లంఘించాడని, అతను కూడా తన తప్పును అంగీకరించాడని తెలిపింది. కాగా ఆ మ్యాచ్లో ముంబై 6 వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
Next Story






