కోహ్లీ మరో రికార్డ్.. సచిన్, ధోనిలను అధిగమించిన ఛేజింగ్ కింగ్..

by Web Desk |
కోహ్లీ మరో రికార్డ్.. సచిన్, ధోనిలను అధిగమించిన ఛేజింగ్ కింగ్..
X

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో రికార్డ్ సాధించాడు.వన్డేలలో భారత్ తరపున విదేశాలలో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. ఛేజింగ్ కింగ్ విరాట్ దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో 9 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు ఈ రికార్డ్ టీమిండియా లెజెండ్ సచిన్ (5065)పరుగుల పేరిట ఉంది. రికార్డ్‌ల రారాజు కోహ్లీ తాజాగా దీనిని అధిగమించాడు. కెప్టెన్ కూల్ MS ధోని (4520) పరుగులతో మూడవ స్థానంలో ఉన్నాడు. తర్వాతి స్థానాల్లో ద్రావిడ్ (3998), గంగూలీ (3468) ఉన్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా ఓటమి పాలయిన విషయం తెలిసిందే.




Next Story

Most Viewed