ENGvsIND: అరుదైన రికార్డు సృష్టించిన జో రూట్

by Gantepaka Srikanth |

లార్డ్స్ మైదానం(Lord's Cricket Ground) వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్(England) స్టార్ ప్లేయర్ జో రూట్(Jeo Root) అరుదైన రికార్డు సృష్టించారు.

ENGvsIND: అరుదైన రికార్డు సృష్టించిన జో రూట్
X

దిశ, వెబ్‌డెస్క్: లార్డ్స్ మైదానం(Lord's Cricket Ground) వేదికగా భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టులో ఇంగ్లండ్(England) స్టార్ ప్లేయర్ జో రూట్(Jeo Root) అరుదైన రికార్డు సృష్టించారు. టెస్టుల్లో భారత్‌పై మూడు వేల రన్స్ చేసిన తొలి ఆటగాడిగా నిలిచారు. ఇప్పటివరకు టెస్టుల్లో 10 సెంచరీలు, 12 అర్ధ సెంచరీలు చేశారు. రూట్ తర్వాతి స్థానంలో రికీ పాంటింగ్ 2555, కుక్ 2431, స్టీవ్ స్మిత్ 2356, క్లైవ్ లాయిడ్ 2344 రన్స్ చేశారు. ఇదిలా ఉంటే.. మూడో టెస్టులో ‘బజ్‌బాల్‌’పై వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. తొలి సెషన్‌లో 25 ఓవర్లు ఆడి 83 పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ జట్టు.. రెండో సెషన్‌లోనూ ఆచితూచి ఆడింది. ప్రస్తుతం క్రీజులో రూట్ (93 పరుగులు), బెన్ స్టోక్స్ (39) పరుగుల వద్ద కొనసాగుతున్నారు. ఈ జోడీని విడదీయడానికి భారత బౌలర్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Next Story