జైశ్వాల్ యూటర్న్.. తిరిగి ముంబైకే ఆడతానంటూ ఎంసీఏను అభ్యర్థించిన యువ బ్యాటర్

by Harish |   ( Updated:2025-05-09 12:35:41.0  )
జైశ్వాల్ యూటర్న్.. తిరిగి ముంబైకే ఆడతానంటూ ఎంసీఏను అభ్యర్థించిన యువ బ్యాటర్
X

దిశ, స్పోర్ట్స్ : దేశవాళీలో ముంబై జట్టును వీడాలనుకున్న తన నిర్ణయంపై భారత యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ యూటర్న్‌ తీసుకున్నాడు. 2025-26 సీజన్‌లో జైశ్వాల్ ముంబైని వీడి గోవాకు ఆడాలనుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్‌వోసీ) కూడా తీసుకున్నాడు. అయితే, తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. తన ఎన్‌వోసీని ఉపసంహరించుకోవాలని ఎంసీఏను అభ్యర్థించాడు. ఈ మేరకు ఎంసీఏకు మెయిల్ చేశాడు. కుటుంబ ప్రణాళికల వల్ల గోవాకు ఆడాలనుకున్నానని, ప్రస్తుతం ఆ ప్రణాళిక లేదన్నాడు. తిరిగి ముంబైకి ఆడేందుకు అనుమతి ఇవ్వాలని ఎంసీఏను కోరాడు. ఎన్‌వోసీని బీసీసీఐగానీ, గోవా క్రికెట్ అసోసియేషన్‌కు గానీ సమర్పించలేదని తెలిపాడు. జైశ్వాల్ అభ్యర్థనపై ఎంసీఏ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.




Next Story