- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
జైశ్వాల్ యూటర్న్.. తిరిగి ముంబైకే ఆడతానంటూ ఎంసీఏను అభ్యర్థించిన యువ బ్యాటర్

X
దిశ, స్పోర్ట్స్ : దేశవాళీలో ముంబై జట్టును వీడాలనుకున్న తన నిర్ణయంపై భారత యువ బ్యాటర్ యశస్వి జైశ్వాల్ యూటర్న్ తీసుకున్నాడు. 2025-26 సీజన్లో జైశ్వాల్ ముంబైని వీడి గోవాకు ఆడాలనుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్(ఎన్వోసీ) కూడా తీసుకున్నాడు. అయితే, తాజాగా తన నిర్ణయాన్ని వెనక్కితీసుకున్నాడు. తన ఎన్వోసీని ఉపసంహరించుకోవాలని ఎంసీఏను అభ్యర్థించాడు. ఈ మేరకు ఎంసీఏకు మెయిల్ చేశాడు. కుటుంబ ప్రణాళికల వల్ల గోవాకు ఆడాలనుకున్నానని, ప్రస్తుతం ఆ ప్రణాళిక లేదన్నాడు. తిరిగి ముంబైకి ఆడేందుకు అనుమతి ఇవ్వాలని ఎంసీఏను కోరాడు. ఎన్వోసీని బీసీసీఐగానీ, గోవా క్రికెట్ అసోసియేషన్కు గానీ సమర్పించలేదని తెలిపాడు. జైశ్వాల్ అభ్యర్థనపై ఎంసీఏ ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
Next Story