భారత క్రీడాభిమానులు ఈరోజును ఎప్పటికీ మర్చిపోలేరు!

by Disha Web Desk 2 |
భారత క్రీడాభిమానులు ఈరోజును ఎప్పటికీ మర్చిపోలేరు!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత క్రికెట్ అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేని రోజు 2nd ఏప్రిల్ 2011. మైదానంలో ఉత్కంఠంగా ఎదురుచూస్తున్న వేల కళ్లు. క్రీజులు టీమిండియా సారథి ఎమ్ఎస్ ధోనీ, ఆల్‌రౌండర్‌ యువరాజ్. ఒక్కసారిగా సైలెంట్ అయిన మైదానం. అదే సమయంలో సిక్స్‌ కొట్టి భారత్‌కు వరల్డ్ కప్ సాధించి పెట్టాడు ధోనీ. టీమిండియా వరల్డ్ కప్ సాధించి నేటికి సరిగ్గా 12 సంవత్సరాలు పూర్తైంది. దీంతో ఆ మధుర జ్ఞాపకాల్ని క్రీడాభిమానులు సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. చరిత్రలో నిలిచేపోయే మ్యాచ్‌‌గా మలిచిన కెప్టెన్ ధోనీకి ధన్యవాదాలు చెబుతున్నారు. ‘‘Dhoni finishes off in style, A magnificent strike into the crowd, India lifts the World Cup after 28 years’’ అంటూ రవిశాస్త్రి చేసిన గూస్‌బంప్స్ కామెంటరీని తలుచుకొని ఎమోషనల్ అవుతున్నారు.










Next Story

Most Viewed